పవన్ పర్యటన విజయవంతం చేద్దాం!
- నియోజకవర్గ ఉమ్మడి ఇన్చార్జిల పిలుపు
తాడేపల్లిగూడెం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం పర్యటనను విజయవంతం చేయాలని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్, టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలోని టిడిపి కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇన్చార్జిలిద్దరూ మాట్లాడారు. తాడేపల్లిగూడెం జీవి మాల్ సెంటర్లో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు పవన్ బహిరంగ సభ ఉంటుందని దీనికి నియోజకవర్గ నలుమూలల నుంచి జనసేన టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలు భారీగా తరలి రావాలని కోరారు. ప్రజల పక్షాన, రాష్ట్ర భవిష్యత్తు కోసం కూటమి నాయకుడు చేస్తున్న ధర్మ యుద్ధానికి ప్రజలందరూ మద్దతు ప్రకటించాలన్నారు. అవినీతి వైయస్సార్ పార్టీని కూకటి వేళ్ళతో పెకలించాలంటే ప్రజలందరూ తలో చేయి వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.
![](https://sritvtelugu.com/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-21-at-5.12.21-PM-1024x461.jpeg)