ధర్మవరం, ఈ నెల 14 వ తేదీన పిఠాపురం, చిత్రాడలో జరగబోయే జనసేన పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవం విజయవంతం చేయుట కొరకు మంగళవారం ధర్మవరం పట్టణంలోని జనసేన పార్టీ నూతన కార్యాలయంలో హిందూపురం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల జనసేన పార్టీ ఇన్చార్జ్ లతో, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్లు, మండల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, జిల్లా కమిటీ సభ్యులు, వీరమహిళలు, ముఖ్య నాయకులతో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. అనంతరం సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 14 వ తేదీన జనసేన పార్టీ 12 వ ఆవిర్భావ దినోత్సవాన్ని కని, విని ఎరుగని రీతిలో పవన్ కళ్యాణ్ పేరు, జనసేన పార్టీ గురించి దేశవ్యాప్తంగా చర్చించుకునే విధంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేసి పిఠాపురానికి లక్షల్లో తరలి వెళ్లాలని పిలుపునిచ్చారు. హిందూపురం పార్లమెంట్ పరిధిలో వున్న 7 నియోజకవర్గాల్లో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఇన్చార్జ్ ల ఆధ్వర్యంలో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లతో సమావేశాలు నిర్వహించాలన్నారు.
Share this content:
Post Comment