ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చేద్దాం: యల్లటూరు శ్రీనివాస రాజు

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం, రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయము (యల్లటూరు భవన్) నందు జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు రాజంపేట పట్టణ యువతతో కలిసి ఛలో పిఠాపురం పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ మార్చి 14న పిఠాపురం చిత్రాడలో జరగనున్న జనసేన 12 వ ఆవిర్భావ సభ చరిత్రలో నిలిచిపోతుందని, జనసేనపార్టీ ఆవిర్భావం నుండి అభివృద్ధి వరకు తోడు ఉన్న ప్రతి ఒక్కరు ఈ వేడుకల్లో పాల్గొని ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విజయవంతం చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట పట్టణ జనసైనికులు యువత సారా రాజేష్, యెద్దల నరేష్, పవన్ రాజు, మోహన్, అరవింద్, మదు, మనోజ్, నరేంద్ర, మనోహర్, ఓబులేష్, మణికంఠ, ఖాదర్, మస్తాన్, కిరణ్, యోగి, గంగుల, రెహమాన్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment