జగణాసుర పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకొందాం

  • రాష్ట్ర గతిని మార్చే తాడేపల్లిగూడెం సభకు ప్రజలు తరలిరావాలి

గుంటూరు, రాష్ట్రం గత ఐదేళ్లుగా జగణాసురుడు అనే రాక్షసుడి గుప్పిట్లో చిక్కి విలవిలాడుతోందని, జగణాసురిడి బారినుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని మాజీమంత్రి, టీడీపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ నెల 28 న తాడేపల్లిగూడెంలో జనసేన-టీడీపీ పార్టీల ఆధ్వర్యంలో జరగనున్న భారీ బహిరంగ సభకు ప్రజాస్వామ్య వాదులంతా తరలిరావాలని ఆయన కోరారు. శనివారం జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో రూపొందించిన ఛలో తాడేపల్లిగూడెం గోడప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు పాల్గొనే ఈ సభ రాష్ట్ర గతిని మారుస్తుంన్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, అక్రమాల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకు ఒక్కటిగా ముందుకు సాగుతున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు ప్రజలంతా అండగా నిలవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు వాక్ స్వంతత్ర్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం అంతా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందని రాష్ట్రంలో మాత్రం జగన్ అరాచక రాజ్యాంగం అమలవుతుందని ధ్వజమెత్తారు. వైసీపీ నేతల దాష్టీకాలను, దౌర్జన్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజల్ని, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు విజన్, పవన్ కల్యాణ్ పోరాట స్ఫూర్తి రాష్ట్రానికి శ్రీరామరక్షగా నిలుస్తున్నాయన్నారు. మేధావులు, సంఘ సంస్కర్తలు ఏకతాటిపైకి వచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణకై కలిసి వారితో నడవాలని కోరారు. రాష్ట్ర నలుమూలల నుంచి తాడేపల్లిగూడెంలో జరగబోయే సభకు టీడీపీ శ్రేణులు, జనసైనికులు తరలిరావాలని కన్నా లక్ష్మీనారాయణ కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తాళ్ళ వెంకటేష్, జనసేన పార్టీ నాయకులు సయ్యద్ షర్ఫుద్దీన్, గడ్డం రోశయ్య, కొలసాని బాలకృష్ణ, నండూరి స్వామి, స్టూడియో బాలాజీ, బాలు, నాజర్ వలి తదితరులు పాల్గొన్నారు.