జనసేన-టీడీపీ పార్టీలకు ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందాం: పెండ్యాల శ్రీలత

అనంతపురం, జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ మహిళా కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా 26వ రోజు శుక్రవారం అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక 33వ డివిజన్ నాయక్ నగర్ నందు పర్యటించి మహిళలతో మమేకమై స్థానిక సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపై అనవసరమైన అపద్దపు కేసులు పెడుతూ ప్రతిపక్షాల ప్రజా గొంతును నొక్కాలని చూస్తున్నాడని రాజ్యాంగ బద్దంగా నిరసనలు తెలియజేసే అంగన్వాడి, ఆశా, డీఎస్సీ నిరుద్యోగులు, సర్పంచులు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజలు వారి భావ ప్రకటనను తెలియజేసే హక్కే లేకుండా చేశాడని ప్రజలంతా ఈ విషయాల్లి గమనించి జనసేన టీడీపీ ఉమ్మడి పార్టీలకు ఓటు వేసి ప్రభుత్వ స్థాపనకు తోడ్పడి ప్రజా స్వామ్యాన్ని కాపాడుకుందాం అన్నారు. వీటితో పాటు స్థానిక డివిజన్ లో మురుగుకాలువలు, మంచినీటి,వీధి దీపాల సమస్య,వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.