మట్టి వినాయకుడిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అనకాపల్లి జనసేన
అనకాపల్లి, జనసేనపార్టీ టౌన్ కమిటీ వారి ఆధ్వర్యంలో అనకాపల్లి టౌన్లో గల నాలుగు రోడ్ల సెంటర్ వద్ద మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం జరిగింది. జనసేన సిద్ధాంతాలలో ఒకటైనటువంటి పర్యావరణ పరిరక్షణను స్ఫూర్తిగా తీసుకొని రంగులు లేనటువంటి మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందని, పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిపై ఉందని వివరించామని, రాబోయే రోజులలో విఘ్నాలు తొలగి జనసేన పార్టీ మరింత బలపడి రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని సాధారణ ప్రజలు కోరుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మల్ల శ్రీను, రామకృష్ణ, దొర, అప్పికొండ గణేష్, జి జగదీష్, గొల్లవిల్లి రాజు, హరీష్, ప్రశాంత్, పీజే, వినోద్, వంశీ, సాయి, జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-30-at-7.35.25-PM-1024x342.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-30-at-7.41.16-PM-1024x461.jpeg)