కేపీహెచ్బీలో లింక్రోడ్డు ప్రారంభం
ఈ రోజు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు కేపీహెచ్బీకాలనీలోని గోకుల్ప్లాట్స్ నుంచి శ్రీలాపార్కు ప్రైడ్ వరకు లింక్ రోడ్డును ప్రారంభించనున్నారు. రోడ్డు డెవల్పమెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రూ.2.10కోట్ల వ్యయంతో 500మీటర్ల పొడవున 80 అడుగుల లింక్ రోడ్డును నిర్మించారు. కూకట్పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతల మధ్య ఉన్న ఈ లింక్ రోడ్డు ద్వారా రోజుకు వేలా ది వాహనాల రాకపోకలు సాగనున్నాయి. దీంతో గోపాల్నగర్ ప్రధాన రోడ్డు, వసంతనగర్ రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ తగ్గనుంది.