క్రియాశీలక సభ్యుని కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు నమ్మి రాంబాబు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది. నెల్లిమర్ల జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి లోకం మాధవి ఆదివారం డెంకాడ మండలం, వల్లూరు గ్రామానికి వెళ్లి నమ్మి రాంబాబు కుటుంబానికి దైర్యం చెప్పారు. ఆదివారం నమ్మి రాంబాబు పెద్ద కర్మ సందర్భంగా వారి గ్రామానికి వెళ్లిన లోకం మాధవి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా లోకం మాధవి మాట్లాడుతూ నమ్మి రాంబాబు లాంటి జనసైనికున్ని కోల్పోవడం చాలా బాధాకరం అని, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని పార్టీ బలోపేతం కోసం తన వంతు తాను ఒక నిశ్వార్ధ జనసైనికుడిలా కృషి చేసారని లోకం మాధవి వారి కుటుంబ సభ్యులతో గుర్తుచేసుకున్నారు. జనసేన పార్టీ తరపున భీమా చెక్కు త్వరలోనే కుటుంబ సభ్యులకు అందుతుందని, జనసేన పార్టీ తరపున అన్ని విధాల ఆ కుటుంబానికి అండగా ఉంటామని లోకం మాధవి తెలియజేసి, ఆ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.