‘లూడో’ ట్రైలర్

దేశవ్యాప్తంగా అన్ లాక్  5.o లోభాగంగా కేంద్రం అనుమతివ్వడంతో పలుచోట్ల థియేటర్లు తెరుచుకున్నప్పటికీ కరోనా కారణంగా ప్రేక్షకులు మాత్రం వాటిపై మొగ్గు చూపడం లేదు. దీంతో చాలా వరకూ సినిమాలు ఓటీటీ వేదికగానే విడుదలవుతున్నాయి. ఈ నేపధ్యం లో తాజాగా. ఓటీటీ స్ట్రీమింగ్​కు సిద్ధమైన బాలీవుడ్​ సినిమా ‘లూడో’ ట్రైలర్.. సోమవారం విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకుంటూ చిత్రంపై అంచనాల్ని పెంచుతోంది.

ఇందులో అభిషేక్ బచ్చన్, రాజ్​కుమార్ రావ్, పంకజ్ త్రిపాఠి, ఆదిత్య రాయ్ కపూర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా నవంబరు 12న నెట్​ఫ్లిక్స్​లో విడుదల కానుంది​. యాక్షన్ అడ్వెంచర్ ఎంటర్​టైనర్ ‘లూడో’ సినిమా ట్రైలర్ అలరిస్తోంది.