లూటుకుర్రు: గాంధీ మహాత్మునికి ఘన నివాళులు
లూటుకుర్రు గ్రామపంచాయతీలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా పి హెచ్సి వారు కుష్టు వ్యాధి నివారణ పై విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ఈ కార్యక్రమంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి గ్రామ సర్పంచ్ అడబాల తాత కాపు నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కుష్టి వ్యాధి నివారణ కొరకు చేపట్టే కార్యక్రమం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పీహెచ్సీ డాక్టర్ స్పందన, పంచాయతీ సెక్రెటరీ సూర్యనారాయణ రాజు, పంచాయితీ సిబ్బంది పీహెచ్సీ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-30-at-7.15.43-PM-1024x461.jpeg)