- ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆవిర్బావ దినోత్సవ సభ రాజంపేట పార్లమెంటు ఇంచార్జ్ అతికారి కృష్ణ
పిఠాపురంలో మార్చి 14న జనసేన పార్టీ 12వ ఆవిర్బావ దినోత్సవ సభ జరుగనున్న నేపథ్యంలో నాయకుల్ని, కార్యకర్తల్ని సమన్వయ పరిచేందుకు రాజంపేట పార్లమెంటు నియోజక వర్గాల పరిధిలో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చెయ్యడం జరిగింది. అందులో భాగంగా మదనపల్లెలోని శేషసాయి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాజంపేట పార్లమెంటు సమన్వయ కర్త అతికారి కృష్ణకి మదనపల్లెలో అపూర్వ స్వాగతం లభించింది. ఈ కార్యక్రమంలో అతికారి కృష్ణ మాట్లాడుతూ మార్చి 14న పిఠాపురంలో జరిగే ఆవిర్బావ సభకు కార్యకర్తలు నాయకులు వీరమహిళలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు వర్గాలు విడనాడి ఏకతాటిపైకి వచ్చి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. కష్టపడిన వారిని పార్టీ అధక్షులు పవన్ కళ్యాణ్ కచ్చితంగా గుర్తిస్తారని వారికి సముచిత స్థానం కల్పిస్తారని చెపుతూ మార్చి 14న జరిగే ఆవిర్బావ సభకు భారీగా జనసైనికులు నాయకులు వీరమహిళలు అభిమానులు తరలి రావాలని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సి.ఎం హోదాలో ప్రభుత్వంలో భాగమైన సందర్భంగా 12వ ఆవిర్బావ దినోత్సవ సభలో ఆయన ప్రసంగాన్ని అధ్యక్షుల వారి దిశానిర్దేశం అందరూ నేరుగా వినాలని కోరారు. అనంతరం ఛలో పిఠాపురం పోస్టర్స్ విడుదల చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి, జిల్లా నాయకులు, నియోజకవర్గం, మండలాలలోని జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Share this content:
Post Comment