మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలి
మదనపల్లిలో మదనపల్లి సాధన సమితి ఆధ్వర్యంలో ఉదయం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిలపక్షం మదనపల్లి జిల్లా చేయాలి అనే విషయం గురించి జరిగిన నిరసన కార్యక్రమంలో జనసేన పార్టీ తరపున పాల్గొన్న.. జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అన్ని మౌళిక సదుపాయాలు కలిగి ఉన్న మదనపల్లి నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని.. అసలే రాష్ట్రం లోటు బడ్జెట్ తో అప్పులపాలై అరకొర సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దానిని పరిపాలన అంటూ తన భుజం తట్టుకుని సంబర పడుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ అయిన ఈ సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు ఎలా చేస్తారని వాటిని ఎలా అభివృద్ది చేస్తారని ప్రభుత్వాని ప్రశ్నించారు.. కనీసం వృద్ధులకు ఫంక్షన్లు, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించే స్థితిలో ప్రభుత్వం లేదని ఎన్నికలు సమయంలో కేంద్ర ప్రభుత్వాని నిలదీసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకుని తెస్తామని ప్రభుత్వం రాగానే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పిన హామీలను వమ్ము చేస్తూ కొత్తగా జిల్లాల ఏర్పాటు విషయం తెరపైకి తేవడం హాస్యాస్పదం అన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-07-at-3.38.52-PM-1024x575.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-07-at-3.23.37-PM-1024x572.jpeg)