మదనపల్లి జనసేన పార్టీలో భారీ చేరికలు

మదనపల్లి నియోజకవర్గం: కమ్మవీధిలో జనసేన పార్టీ కార్యాలయంలో రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి అధ్యక్షతన జనరల్ సెక్రటరీ జనార్దన్ ఆధ్వర్యంలో మాచిరెడ్డిగారిపల్లె, అగ్గిపుల్లల ఫ్యాక్టరీ, ఇందిరా నగర్ నుండి అంజాద్, షంశీర్, సలీం, హరి, వెంకటేష్, నరసింహులు, భరత్, ఆది, మాలిక్, శివ, భాను, రవి, నవీన్ తదితరులకు గంగారపు రామదాస్ చౌదరి 60 మందికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జిల్లా జాయింట్ సెక్రటరీ లు సనా ఉల్లా, గజ్జల రెడ్డెప్ప, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర, లవన్న, పట్టణం ఉపాధ్యక్షులు పురం నగేష్, రూరల్ ప్రధాన కార్యదర్శి జంగాల గౌతమ్, సెక్రటరీ నాగవేణి, ప్రధాన కార్యదర్శి జవిలి మోహన్ కృష్ణ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.