టీడీపీ నిరసన దీక్షకు మదనపల్లి జనసేన మద్దతు

మదనపల్లి నియోజకవర్గం: మదనపల్లిలో బెంగళూరు బస్టాండ్ వద్ద మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ కు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న టిడిపి నాయకులకు సంఘీభావం తెలపడానికి జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారాపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవనిగడ్డ లో నాలుగో విడత వారాహి యాత్రలో మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి ధైర్యం కాదు పిచ్చ ఉందని రాబోయే ఎన్నికల కురుక్షేత్ర సంగ్రామంలో జనసేన టీడీపీ నాయకులు పాండవులు, వైసీపీ వాళ్ళు కౌరవులు అని జనసేన టీడీపీ సంయుక్త ప్రభుత్వంని స్థాపించాబోతున్నామని, సైకో ప్రభుతాన్ని కూలదోస్తాం అని నిస్పష్టమైన సంకేతాలు ఇచ్చారన్నారు. టీడీపీ జనసేన పొత్తు అధికారకంగా ప్రకటన తర్వాత మొట్ట మొదటి వారహి యాత్ర కన్నుల విందుగా, జనసేన శ్రేణులు ఒక ప్రక్క, టీడీపీ శ్రేణులు ఒక పక్క వైసీపీ ప్రభుత్వం పతనం కోసం ఇక్కడ ఉన్న జనసేన టీడీపీ పార్టీల నాయకులు కార్యకర్తలు ఎదురుచూస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, రెడ్డెమ్మ, మోహన్ కృష్ణ, అర్జున, చంద్రశేఖర, జంగాల గౌతమ్, జయ, శంకర, జనార్దన్, విజయ్ కుమార్, గంగులప్ప టీడీపీ, జనసేన కార్యకర్తలు, వీరహిళలు తదితరులు పాల్గొన్నారు.