24 గంటల్లో 100 క్రియాశీలక సభ్యత్వాలు

ఆచంట నియోజకవర్గం నుంచి 24 గంటల్లో 100 క్రియాశీలక సభ్యత్వాలు చేసిన శ్రీమతి మేకల చంద్ర కుమారిని మహిళా దినోత్సవం సందర్భంగా
జిల్లా ఉపాధ్యక్షులు వెంగళదాసు దానయ్య ఆధ్వర్యంలో చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కంబాల బాబులు, పెనుగొండ వార్డు సభ్యులు చిట్నిడి రాము, బళ్ళ మాధవ్, తోట సురేంద్ర, వీరమహిళలు మణిమాల, బళ్ళ ప్రసన్న, నూకల సాయి, మణికంఠ, అందాల అయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు.