నరసాపురం మత్స్యకార అభ్యున్నతి సభలో పాల్గొన్న మాడుగుల జనసైనికులు

జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురంలో చేపట్టిన మత్స్యకార అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసిన సభలో విశాఖపట్నం జిల్లా లో మాడుగుల నియోజకవర్గం నుంచి భారీగా జనసైనికులు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధినేత ఏ పని చేపట్టినా మా మాడుగుల నియోజకవర్గ జనసైనికుల మద్దతు ఎల్లప్పుడూ ఉంటూ.. పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తూ పార్టీని బలపేతం చేసి జనసేనాని పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయించుకుని పార్టీ ప్రతి కార్యక్రమాలలో మా వంతు కృషి చేస్తున్నాం అని జనసైనికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాడుగుల నియోజకవర్గ జనసైనికులు.. గుమ్మడి శ్రీరామ్, వీర సురేఖ, ప్రసాద్, రొబ్బా మహేష్, గండెం రాంబాబు, రౌతు ప్రసాద్, దయా యాదవ్, కలిపిరెడ్డి రాజా, గట్రెడ్డి శివాజీ, శివ, జగదీష్, అభి, బలరాం, రాము, నాయుడు, తదితర జనసైనికులు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-02-21-at-6.22.08-PM-1024x460.jpeg