కార్మికుల సమ్మెకి మద్దతు తెలుపుతున్న మాడుగుల జనసేన నాయకులు

*గోవాడ షుగర్స్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న మాడుగుల జనసేన

వి.మాడుగుల, గోవాడ షుగర్స్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కార్మికులు చేపట్టిన సమ్మెకు జనసేన పార్టీ మద్దతు తెలుపుతూ 25సంవత్సరాల సర్వీసును పరిగణలోకి తీసుకోని కార్మికులందరినీ డైలీవేజ్ కార్మికులుగా గుర్తించి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమానా పనికి సమానా వేతనం అమలుచేయాలి అని రాష్ట్ర ప్రభుత్వం వారు ఇఛ్చిన జీవో నం. 126 ద్వారా బినామీ కాంట్రాక్టర్లను తొలగించాలని ఏపిసిఓఎస్ {ఆప్కాస్} ద్వారా వేతనాలు చెల్లించాలని, అన్ సీజన్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరికి ప్రోవడెంట్ ఫండ్ కట్టాలని, డైలీవేజ్ కార్మికుడు మరణిస్తే వారి కుటుంబానికి ఏవిధంగా ఉపాధి కల్పిస్తున్నారో అదే పద్దతిని కాంట్రాక్ట్ కార్మికులకు వర్తింపచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కార్మికులందరికీ జనసేన పార్టీ మద్దతు ఎప్పుడు ఉంటుంది అని కార్మికులకు కష్టం వస్తే జనసేన పార్టీ సహించబోము అని జనసేన పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాడుగుల జనసేన పార్టీ జనసైనికులు రొబ్బా మహేష్, గండెం రాంబాబు, రౌతు ప్రసాద్, కలిపిరెడ్డి రాజా, కోళ్ల చిన్నా, ధరిమిశెట్టి అప్పలరాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.