రాజ్ కుమార్ కుటుంబానికి ఆర్థికసాయం చేసిన మాడుగుల జనసేన

మాడుగుల నియోజకవర్గం: ఇటీవలే రాజుల కృష్ణాపురంకు చెందిన జనసైనికుడు చిత్రాల రాజ్ కుమార్ గాదరిలో వివాహానికి లైటింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి చనిపోవడం జరిగింది. రాజ్ కుమార్ ను ఆదుకోనేందుకు గానూ.. సోమవారం మాడుగుల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు అందరూ 23000 నగదును పోగు చేసి మాడుగుల నియోజకవర్గ జనసేన నాయకులు రాయపురెడ్డి కృష్ణ చేతులు మీదగా మరియు అజిత్ కుమార్ భూపతి అధ్వర్యంలో ఈ యొక్క నగదును రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాడుగుల మండల జనసేన నాయకులు గట్ట రామారావు, కోన శ్రీను, రొబ్బ మహేష్, గుమ్మాల నానాజీ, దాసరి అచ్యుతరావు, రామకృష్ణ, హరి బాల కృష్ణ, కెమిశెట్టి గణేష్, ఒండ్రు కుమార్, గల్లా గణేష్ తదితరులు పాల్గొన్నారు.