తుఫానులో సైతం మూడవరోజు మహాపాదయాత్ర
రాజానగరం, భారీ తుఫాను ని సైతం లెక్కచేయకుండా రాజానగరం మండలం తోకాడ గ్రామంలో మూడవ రోజు జనం కోసం జనసేన మహాపాదయాత్ర ఉదృతంగా సాగడం జరిగింది. జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, వారి కుమార్తెలు ప్రత్యూషాదేవి, వందనాంబిక లకు హారతులు పడుతూ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలకడం జరిగింది. ముందుగా గ్రామంలో ఉన్న డా.బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. జనంకోసం జనసేన మహా పాదయాత్రలో భాగంగా రాజానగరం మండలం తోకాడ గ్రామంలో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వెళుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, లక్ష్యాలను ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీ కరపత్రం, బ్యాడ్జ్, కీచైన్లను పంచుతూ రాబోయే 2024 ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు పై ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసి మన భావితరాలకు మంచి భవిష్యత్తును ఇద్దామని ఈ సందర్భంగా బత్తుల తెలిపారు. గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏకపక్షంగా మద్దతు తెలియజేసి, రానున్న ఎన్నికల్లో పూర్తిగా జనసేన పార్టీ పక్షాన నిలబడి బత్తుల బలరామకృష్ణ నాయకత్వాన్ని బలపరుస్తామని యువత కేరింతలతో, అడుగడుగున మహిళల హారతులతో జనసేన పార్టీకి బ్రహ్మరథం పట్టేలా సుదీర్ఘంగా సాగింది. రాజానగరం నియోజకవర్గంలో మునుపెన్నడు లేని విధంగా పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేస్తూ నిత్యం జనంలోనే ఉంటూ ప్రజల కష్ట సుఖాల్లో ఎల్లపుడు తోడుగా ఉంటూ నాయకులు అంటే ఇలా ఉండాలి అని నిరూపించిన నాయకులు బత్తుల బాలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, తోకాడ గ్రామ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు భారీగా పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-05-at-16.10.03-2-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/12/WhatsApp-Image-2023-12-05-at-16.09.57-1024x768.jpeg)