“మహాపాదయాత్ర” కు విశేష ఆదరణ
- జనంకోసం జనసేన ‘మహా పాదయాత్ర’ 12వ రోజు
రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, రాజవరం గ్రామంలో ‘జనంకోసం జనసేన’ ‘మహా పాదయాత్ర’ 12వ రోజు భాగంగా రాజవరం గ్రామంలో కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి ల ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్రలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రతి ఇంటికి వివరిస్తూ… ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని, దానికి ప్రజలందరూ సహకరించి ఈసారి జనసేనాని పవన్ కళ్యాణ్ కి ఒక అవకాశం ఇచ్చి, ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయాలని, గ్రామంలో ప్రతి ఒక్కరిని అభ్యర్థించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ మెడిశెట్టి శివరాం, సర్పంచులు కిమిడి శ్రీరామ్, గుల్లింకల లోవరాజు, గళ్ళ రంగా ఎంపిటిసి పళ్ళ ధనలక్ష్మి, సీనియర్ నేతలు కర్రి దొరబాబు, బదిరెడ్డి దొర, నరసాపురం నాగేశ్వరరావు, కూనవరం వీరభద్రరావు, అడ్డాల దొరబాబు, మన్యం శ్రీను, మద్దిరెడ్డి బాబులు, మట్ట వెంకటేశ్వరరావు, అడ్డాల శ్రీను, నాతిపాం దొరబాబు,అరిగెల రామకృష్ణ, ఎర్రంపాలెం శ్రీను, కురుమళ్ళ మహేష్, ఇందల వీరబాబు, పండు హెచ్ వై డి, ముచ్చి మణికంఠ, దర్మదాసు మాణిక్యం, ఇందల, సతీష్, దంగేటి సత్తిబాబు, పెద్దఎత్తున వీర మహిళలు, నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-22-at-6.39.03-PM-1024x460.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-22-at-6.39.04-PM-1024x460.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-22-at-6.38.56-PM-1024x460.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-22-at-6.38.59-PM-1024x768.jpeg)