దొడ్డిగర్ల సువర్ణరాజు ఆధ్వర్యంలో మహాపాదయాత్ర

గోపాలపురం నియోజకవర్గంలోని త్యాజంపూడి నుండి యాదవోలు గ్రీన్ ఫీల్డ్ హైవే వరకు ఉన్న రహదారి పూర్తిగా ధ్వంసం అయ్యి అద్వాన్నంగా మారి ఈ రహదారిపై ప్రయాణం చేసే ప్రయాణీకులు నరకయాతను అనుభవిస్తున్నారు. కావున తక్షణమే ఈ రహదారిని పునర్నిఎమించాలి అని ప్రభుత్వాన్ని కోరుతూ గోపాలపురం నియోజకవర్గ జనసేన నాయకులు దొడ్డిగర్ల సువర్ణరాజు ఆధ్వర్యంలో ఆదివారం త్యాజంపూడి నుండి యాదవోలు గ్రీన్ ఫీల్డ్ హైవే వరకు సుమారు 15 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించడం జరిగింది. గోపాలపురం నియోజకవర్గ జనసేన నాయకుల ఆహ్వానం మేరకు ఈ పాదయాత్రలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.ఘంటసాల వెంకటలక్ష్మి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి మరియు ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు, తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి విడివాడ రామచంద్రరావు, ఏలూరు జిల్లా జాతీయ బిసి సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి మరియు ఏలూరు జనసేన నాయుకులు చందు తాతపూడి మరియు జనసేన పార్టీ ఎంపిటిసిలు, సర్పంచులు నియోజకవర్గంలోని అన్ని కమిటీల నాయకులు, వీరమహిళలు, జనసైనికులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.