ఉత్తరాఖండ్‌ జలప్రళయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మహేష్‌

ఉత్తరాఖండ్ లో వరద పరిస్థితులు ఏర్పడ్డాయి. ఛమోలీ జిల్లాలోని తపోవన్ ఏరియాలో ధౌలీగంగ నదిలో కొండచరియలు విరిగిపడటంతో.. వరద ప్రవాహం అనూహ్యంగా పెరిగింది. మంచు చరియలు విరిగి పడడంతో మొదలైన వరదల్లో ఇంత వరకూ 10 మంది వరకూ చనిపోగా, 170 మందికి పైగా గల్లంతయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రస్తుతం సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఘటనపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘ఈ ఘటన జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి పలువురిని కాపాడిన (ITBP Jawan) ఐటీబీపీ జవాన్లకు మహేష్‌ సెల్యూట్‌ చేశారు. వరదల్లో గల్లంతైన వారు క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నట్లు’ మహేష్‌ బాబు ట్వీట్‌ చేశారు.