వినాయక చవితి ఉత్సవాలలో పాల్గొన్న పోతిన మహేష్

విజయవాడ పశ్చిమ నియోజకవర్గం: వినాయక చవితి సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ నియోజకవర్గంలోని పలు గణేష్ పందిరిలకు నగదు రూపాన, వస్తురూపాన నాలుగు లక్షల 40 వేల రూపాయలు అందజేశారు. అనేక వినాయక చవితిపందిరిలను సందర్శించి గణపతి హోమాల కార్యక్రమాల్లో, కుంకుమ పూజా కార్యక్రమాలలో, అన్నసమారాధన కార్యక్రమాలలో, స్వామి వారి ఊరేగింపు కార్యక్రమాలలో పోతిన వెంకట మహేష్ పాల్గొని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు, అదేవిధంగా ప్రతి పందిరిలోని కమిటీ సభ్యులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమలలో జనసేన పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లు, నగర కమిటీ సభ్యులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.