జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయండి: షేక్ సుభాని

మార్చి 14న పిఠాపురం సమీపంలోని చిత్రాడలో జరగనున్న జనసేన పార్టీ 11వ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని వింజమూరు మండలం జనసేన పార్టీ ఉపాధ్యక్షులు షేక్ సుభాని పిలుపునిచ్చారు. ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి రావాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయడం ప్రతి జనసైనికుడి బాధ్యత అని తెలిపారు. ఈ నెల 13వ తేదీ రాత్రికల్లా కార్యకర్తలు, అభిమానులు బయలుదేరేలా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. భారీ సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని షేక్ సుభాని పిలుపునిచ్చారు.

Share this content:

Post Comment