జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయండి: పితాని బాలకృష్ణ

*ముమ్మిడివరం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలతో సమావేశం ముమ్మిడివరం జనసేన పార్టీ కార్యలయంలో జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు పితాని బాలకృష్ణ అధ్యక్షతన ఘనంగా జరిగింది

14 వ తారీకు న మంగళగిరిలో జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ కు ముమ్మిడివరం నియోజకవర్గం నుండి జనసైనికులు, నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు అందరూ కలిసికట్టుగా పనిచేసి, ముమ్మిడివరం నియోజకవర్గం నుండి వేలాదిగా తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతూ.. పితాని బాలకృష్ణ నియోజకవర్గ నాయకులకు పిలుపునిచ్చారు.

జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల మహిళా అధ్యక్షురాలు ముత్యాల జయ లక్ష్మి మాట్లాడుతూ.. రెండు జిల్లాలోని జేనసేన నాయకులతో కలసి పార్టీ బలోపేతం చేసి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చేసేవరకూ.. పనిచేస్తానని.. అలాగే 14వ తేదీ జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జనసైనికులు, అభిమానులు వేలాదిగా తరలి వచ్చి సభను విజయమవంతం చేయాలనీ కోరారు.

ఈ కార్యక్రమంలో బాలకృష్ణ గారి సమక్షంలో పలువురు జనసేన పార్టీలో చేరారు

ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ ఛాంబర్ ప్రధాన కార్యదర్శి గుద్దటి జమి, గోదాశి పుండరీష్, సానబోయిన మల్లికార్జున రావు, అత్తిలి బాబురావు, మద్దింశెట్టి పురుషోత్తం, మోకా బాలప్రసాద్, గోలకోటి వెంకన్న బాబు, అంగాని నరసింహ మూర్తి, సంగాని రామకృష్ణ, యలమంచిలి బాలరాజు, నాతి నాగేశ్వరావు, రాంబాల రమేష్, ముత్యాల జయలక్ష్మి, గిడ్డి రత్నశ్రీ, పిల్లా అనూష, సానబోయిన వీరబాద్రావు, లంకెలపల్లి జమ్మి, బుల్లి, దూడల స్వామి, జనిపల్లి ప్రశాంత్, అధిక సంఖ్యలో జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-03-11-at-8.26.15-PM-1024x580.jpeg