జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయండి: సోమరౌతు అనూరాధ

జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతంగా జరపాలని ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి సోమరౌతు అనూరాధబ్రహ్మం పేర్కొన్నారు. ఆదివారం వేమూరు మండలంలోని వరాహపురం గ్రామంలో ఆవిర్భావ సభకు సంబంధించి గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె ఈనెల 14వ తేదీన జనసేన ఆవిర్భావ సభ పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాడ గ్రామంలో జరగనుందని తెలిపారు. ఈ సభకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, పలువురు రాష్ట్ర నాయకులు, మంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని, ఆ సభను విజయవంతం చేయాలని జనసైనికులు, వీర మహిళలు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆమె కోరారు. బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు మందా జనార్ధన్ మాట్లాడుతూ, జనసేన ఆవిర్భావ సభకు తమ పార్టీ పూర్తి సహాయం అందిస్తుందని, ప్రతి ఒక్కరు చిత్రాడ గ్రామంలో జరిగే సభకు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి ఎల్లమాటి దాసు, బిజెపి వేమూరు నియోజకవర్గ అధ్యక్షుడు వెలివెల సాంబశివరావు, క్రాప అనిల్, ఎల్లమాటి కృపారావు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment