జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయండి: డా.ఘంటసాల వెంకటలక్ష్మి

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాల్లో పార్టీ పెట్టి 12 సంవత్సరాల తరువాత, నేడు అధికారంలో భాగం పంచుకుంటూ ఒక పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా ఏర్పడిన తరువాత,మార్చి 14 వ తేదీన పిఠాపురంలోని చిత్రాడలో జరగబోయే ఈ ఆవిర్భావ దినోత్సవ మహోత్సవానికి జనసేన పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త వేడుకల్లో పాల్గొనే విధంగా పార్టీ ఏర్పాటు చేయబడిందని, జన చైతన్యమే జనసేన ఆశయమనీ, దగాపడ్డ పేదల పక్షాన నిలిచి, వారి సమస్యలపై సాగించిన పోరుకు ఫలితంగానే జనసేన పార్టీకి అపూర్వ ఆదరణ లభిస్తుందని దెందులూరు ఇంచార్జ్ డా. ఘంటసాల వెంకటలక్ష్మి అన్నారు. శుక్రవారం దెందులూరు నియోజకవర్గాల నాయకులతో వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఏలూరు జనసేన పార్టీ ఆఫీస్ నందు నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా ఏలూరు పార్లమెంటు నియోజకవర్గాల సమన్వయకర్త, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన నిర్వహించే జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రతి ఒక్కరికి పండుగ రోజనీ, ఈ సభను విజయవంతం చేయడానికి ప్రతి జన సైనికుడు, వీర మహిళలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆవిర్భావమే ఒక ప్రభంజనమని, జనసేన ప్రయాణం ప్రజా సమస్యలపై పోరాడే ఒక యుద్ధ నౌక అని ఘంటసాల వెంకటలక్ష్మి అన్నారు ప్రత్యర్థుల విమర్శలను, ఇబ్బందులను సైతం లెక్క చేయక నిలబడి, కలబడి 100% విజయబావుట ఎగరవేసిన పార్టీ జనసేన పార్టీ అని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా కదిలే లక్షలాదిమంది సైన్యం జనసేన పార్టీ సొంతమని ఆయన వెల్లడించారు. ప్రజలకు కల్లబొల్లి కథలు చెప్పి మోసగించే నేతలను జనసేన నాయకులు నిలదీశారని, ప్రతి సమస్యలపై జనసేన పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని ఆయన గుర్తు చేశారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభ విజయవంతానికి 254 మందితో వేసిన 14 కమిటీలు ప్రజల్లోకి వెళ్తున్నాయని తెలిపారు. పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసి మరోసారి జనసేన పార్టీ శక్తిని దేశానికి చాటుదామని వెంకటలక్ష్మి పిలుపునిచ్చారు.

Share this content:

Post Comment