జనసేన భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి: తోట లక్ష్మీనారాయణ

సత్తెనపల్లి నియోజకవర్గం, ధూళిపాళ్లలో డిసెంబర్ 18వ తేదీన అనగా ఆదివారం జనసేన పార్టీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అనుపాలెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ బుధవారం తెలిపారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ మహాసభ హాజరవుతారని, రాజుపాలెం, సత్తెనపల్లి నుండి జనసేనలోకి భారీ చేరికలు ఉంటాయని, భారీగా జన సమీకరణ సన్నాహాల్లో జనసేన నాయకులు, కార్య కర్తలు ఉన్నట్లు లక్ష్మీ నారాయణ తెలిపారు. అదే విధంగా పల్నాడు జిల్లా జనసేన కార్యకర్తలు, అభిమానులు, నాయకులు పాల్గొని ఈ సభను జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు.