కౌలురైతు భరోసాయాత్రను విజయవంతం చేయండి: శీలం బ్రహ్మయ్య

మైలవరం: జనసేన పార్టీ కార్యాలయం మైలవరం నందు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య మాట్లాడుతూ.. డిసెంబర్ 18 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కౌలురైతు భరోసాయాత్రలో భాగంగా జనసేన పార్టీ అధినేత, ప్రజానాయకుడు, కౌలురైతుల ఆపద్బాంధవుడు పవన్ కళ్యాణ్ సత్తెనపల్లిలో నిర్వహిస్తున్న సభకు వేలాదిగా జనసైనికులు, వీర మహిళలు మరియు కౌలురైతులు తరలిరావాలని పిలుపునిచ్చారు. మరణించిన కౌలురైతుల సంఖ్య ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉన్నందువల్ల, మొదట మధ్యాహ్నం 1.00 గంటలకు నిర్వహించవలసిన సభను, ఒక గంట ముందుగానే మధ్యాహ్నం 12.00 గంటలకు మొదలవుతుందని తెలియజేశారు.