ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనను విజయవంతం చెయ్యండి!

జనసేన, టీడీపీ, బీజేపీ ముఖ్య నాయకులతో ప్రధాని నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు సంబందించిన సమావేశంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పీఏసీ సభ్యులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో భారత ప్రధాని నరేంద్రమోడీ 3 భారీ భాహిరంగ సభలు, పీలేరు, అనకాపల్లి, రాజమండ్రి వంటి నాగరాల్లో జరుగుతాయి. అలాగే విజయవాడలో రోడ్డుషో జరగనున్న నేపథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేయటానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటానికి విజయవాడలో జరిగింది. రాబోవురోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. ఉమ్మడి నాయకుల విజయానికి అందరూ సహకరించమని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రాయలసీమ నుంచి జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్, తాతంశెట్టి నాగేంద్ర, టీడీపీ ఎర్ర రామయ్య సృజన చౌదరి, విజయవాడ నుంచి కూటమి నాయకులు పాల్గొన్నారు.