కౌలు రైతు భరోసా యాత్రను విజయవంతం చేయండి: సయ్యద్ నాగుర్ వలి
సత్తెనపల్లి: కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఈనెల 18న ఆదివారం సత్తెనపల్లి నియోజకవర్గంలోని ధూళిపాళ గ్రామంలో జరిగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి పిలుపునిచ్చారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మృతి చెందిన 300 మంది కౌలు రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చెక్కును అందజేయనున్నట్లు వారు తెలిపారు. జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని జనసేన పార్టీ నకరికల్లు మండలం వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి తెలిపారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/naagur-1024x576.jpg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/12/WhatsApp-Image-2022-12-16-at-08.37.46.jpeg)