వారాహి విజయ యాత్రను విజయవంతం చేయండి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో వారాహి విజయ యాత్రలో భాగంగా రాజోలు నియోజకవర్గానికి విచ్చేయుచున్న పవన్ కళ్యాణ్ పర్యటన విజయవంతం చేయడానికి మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన రాజోలు మంగెన గంగయ్య కళ్యాణ మండపంలో వారాహి యాత్ర రాజోలు నియోజకవర్గ ఇన్చార్జ్ మధుసూదన్ రెడ్డి, అమ్మిశెట్టి వాసు సమక్షంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజోలు నియోజకవర్గ జనసేన నాయకులు, సర్పంచ్ లు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు. అనంతరం గోదావరి ముంపుకు గురవుతున్న ప్రాంతాలను పర్యటించడం జరిగింది.