వారాహియాత్ర బహిరంగ సభలను విజయవంతం చేయండి: జ్యోతుల శ్రీనివాసు

పిఠాపురం: వారాహియాత్ర బహిరంగ సభలను, కత్తిపూడి, పిఠాపురం సభలను విజయవంతం చేయవలసినదిగా గొల్లప్రోలు మండలంలో పలు గ్రామాలలో జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు పర్యటన చేసారు. పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి గొల్లప్రోలు మండలం చందుర్తి, కొడవలి తాటిపర్తి, చేబ్రోలు గ్రామాలలో జ్యోతుల శ్రీనివాసు పర్యటిస్తూ.. కరపత్రాలను పంపిణీ చేస్తూ.. ప్రజలందరినీ కూడా 13, 14వ తేదీలలో కత్తిపూడి, పిఠాపురంలో జరిగే శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభకు యావన్మంది రావాలని, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని కోరుతూ పలు కూడలిలో ప్రచారం నిర్వహించారు‌. తాటిపర్తి, కొడవలి గ్రామాల్లో గొల్లప్రోలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు అమరాది వల్లీ రామకృష్ణ జ్యోతుల శ్రీనివాస్ తో కలిపి ప్రచారం నిర్వహించారు. జ్యోతులు శ్రీనువాసు వెంట అమరావతి వల్లీ రామకృష్ణ, గారపాటి చంటి, గౌతు సుబ్రహ్మణ్యం, వంటిపల్లి రాంబాబు, దాసం వెంకటరమణ, సాదా రమణ, గారపాటి కొండలరావు, మాదేపల్లి కృష్ణ అడబాల వీర్రాజు, జ్యోతుల సీతరాంబాబు, మేడిబోయిన సత్య నారాయణ, జ్యోతుల గోపి తదితరులు పాల్గొన్నారు.