యువశక్తి సభను విజయవంతం చేయండి: గాజువాక జనసేన
గాజువాక: జనసేన పార్టీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో జనవరి 12వ తేదీన ఏర్పాటు చేసిన యువశక్తి భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని శనివారం జీవీఎంసీ 86వ వార్డ్ జనసేన పార్టీ ఇన్చార్జ్ కాద శ్రీను ఆధ్వర్యంలో దువ్వాడ విజ్ఞాన్ కాలేజీ వద్ద విద్యార్థులకు యువశక్తి సభ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేసి, వారిని చైతన్యపరిచి యువశక్తి సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజవర్గం సీనియర్ నాయకులు, జనసేన పార్టీ 85వ వార్డు ఇన్చార్జ్ మరియు యువశక్తి మహాసభ ప్రచార కమిటీ సభ్యులు గవర సోమశేఖర రావు, గాజువాక నియోజవర్గం సీనియర్ నాయకులు మరియు జీవీఎంసీ 73వ వార్డు ఇంచార్జ్ ఆర్మీ గోవింద్, విశాఖ జిల్లా జనసేన పార్టీ లీగల్ సెక్రెటరీ శ్రీమతి కర్ణం కళావతి, గాజువాక నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు అల్లు రామారావు, పి వసంత్, కే గోవింద్ రాజు, బ్రహ్మాజీ రావు, జి త్రినాథ్, ఎం సంజీవరావు, పైడ్రాజు, బి శ్రీనివాసరావు, ఇతర జనసేన నాయకులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-07-at-10.11.46-PM-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/01/WhatsApp-Image-2023-01-07-at-10.11.47-PM-1024x461.jpeg)