వారాహి యాత్రకు ఏర్పాట్లను పరిశీలించిన మాకినీడి

పిఠాపురం నియోజవర్గం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జూన్ 14వ తేదీ నుండి తలపెట్టిన వారాహి యాత్రకు ఏర్పాట్లు చేయడంలో భాగంగా పిఠాపురం నియోజవర్గంలో వేదికను జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, గొల్లప్రోలు టౌన్ ప్రెసిడెంట్ వినుకొండ శిరీష, యు కొత్తపల్లి మండల ప్రెసిడెంట్ పట్టా శివ, పిఠాపురం రూరల్ జనసేన నాయకులు (జడ్పీటీసీ అభ్యర్థి) వూట నాని బాబు, లంక పూర్ణ, దొడ్డి దుర్గాప్రసాద్, మెరుగు ఇజ్రాయిల్, జన సైనికులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.