క్రిస్మస్ ఆరాధన వేడుకల్లో పాల్గొన్న మాకినీడి శేషుకుమారి

పిఠాపురం: 1వ వార్డు అగ్రహారం జనసేన పార్టీ నాయకులు పిట్టా చిన్న ఆహ్వానం మేరకు వారి స్వగృహం నందు ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఆరాధన వేడుకల్లో పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి పాల్గొని యేసుక్రీస్తు దీవెనలు తీసుకున్నారు. పాస్టర్ ఇమ్మాన్యుయేల్ మరియు సంఘ పెద్దలు జనసేన పవన్ కళ్యాణ్ మరియు మాకినీడి శేషుకుమారి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి, రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, బుర్ర సూర్య ప్రకాష్, మేళం బాబీ, నామా సాయి బాబు, మహేష్, రాజ కుమార్, సందీప్, నందు, జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.