జనసేన ఎంపిటిసి శ్రీమతి దూలపల్లి రత్నం భర్త అన్నవరంను పరామర్శించిన మాకినీడి శేషుకుమారి

పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషు కుమారి చిత్రాడ ఎంపిటిసి శ్రీమతి దూలపల్లి రత్నం భర్త అన్నవరం కి హార్ట్ స్ట్రోక్ రావడంతో వారి కుటుంబానికి ఆ సమయంలో డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. గురువారం అన్నవరం ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి వారి ఇంటికి వెళ్లిన మాకినీడి శేషుకుమారి రత్నం కుటుంబాన్ని పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో. దేశిరెడ్డి సతీష్, కోటిపల్లి కాశీ విశ్వనాథ్, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.