శివస్వామికి మనోధైర్యాన్నిచ్చిన మాకినీడి శేషుకుమారి

పిఠాపురం, 24 వ తారీఖున ఉదయం పిఠాపురం టు సామర్లకోట రోడ్డులో గొల్లప్రోలు మండలం ఏపీ మల్లవరం చెందిన జనసైనికుడు
ములికి శివస్వామికి యాక్సిడెంట్ జరిగి తలకి, కాలుకి, పొట్ట భాగంలో బలమైన గాయాలు అవ్వటం వల్ల ఆపరేషన్ జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి గురువారం కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు వెళ్లి స్వామి ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని ధైర్యం చెప్పి అక్కడ ఉన్న డాక్టర్ తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, మేళం రామకృష్ణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.