గ్రామీణ కళాకారుల పట్ల మాకీనీడి శేషుకుమారి ఔదార్యం..!

  • తీన్ మార్ బృందానికి వాయిద్య పరికరాలు అందజేత…

పిఠాపురం నియోజకవర్గం: నియోజకవర్గంలోని బి. కొత్తూరు గ్రామానికి చెందిన గ్రామీణ కళాకారుల ప్రోత్సాహంలో భాగంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి గ్రామీణ కళాకారులకు తీన్మార్ వాయిద్య పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువకులను ప్రోత్సహించాలనే ఆశయంతో బి.కొత్తూరు యువకులకు తీన్మార్ వాయిద్య పరికరాలు అందజేయడం జరిగిందని తద్వారా, నిరుద్యోగులుగా ఉన్న వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గోపు సురేష్, దొడ్డు రాంబాబు, కోరాడ సత్తిబాబు, అకేటి స్వామి, దొడ్డి బాబ్జి, దమ్మేటి రాజేష్, రౌతు శివ బాబు, కంద సోమరాజు, నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.