ముంపు ప్రాంతాలలో పర్యటించిన మాకినీడి

*మురికి నీరుతో ముప్పుకి గురవుతున్నా పట్టించుకోని అధికారులు

*పర్యటనకు వచ్చిన ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి దగ్గర ఆవేదన వక్తపరచిన జీవనగర్ ప్రజలు

*తక్షణమే చర్యలు చేపట్టకపోతే మున్సిపల్ ఆపీసు ఎదురుగా బయటాయిస్తామన హెచ్చరించిన మాకినీడి శేషుకుమారి

కాకినాడ జిల్లా, పిఠాపురం పట్టణంలో ప్రభుత్వాలు మారతాయి, ప్రజా ప్రతినిధులు మారతారు కాని మాపరిసరాలూ.. మా పరిస్థితి మారడంలేదని.. వర్షం కురిస్తే మా ప్రాంతమంతా పదిసంవత్సరాలుగా మురికి మయం అవుతుందని.. పిఠాపురం టౌన్ 25వ వార్డు జీవనగరం ప్రజలు వెలపోయారు. గతకొన్ని రోజులుగా కురుస్తున్నవర్షాలకు జనసేన పార్టీ ముంపు ప్రాంతాలలో పర్యటనలో భాగంగా స్ధానిక జీవనగరం 25వ వార్డులో పర్యాటించిన జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జి మాకీనీడి శేషుకుమారి పరిసరాలు పరిశీలించి.. వార్డుసమస్యలను అడగ్గాపైవిధంగా ఆవేదనవ్యక్తం చేసారు. ఈ సమస్యలను అధికారులు, స్థానిక శాసనసభ్య సభ్యుల దృష్టికి తీసుకెళ్ళి.. పరిష్కారం అయ్యేవరకు మీపక్షాన పోరాడతాని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో నేను ఉన్నానని.. నేను ఉంటాను.. నేను విన్నాను అని మాయ మాటలుపలికి.. ఓట్లుదండుకుని ప్రజలను మురికి నీటిలో వదలి వెళ్ళడం, ప్రజలు మాపరిశరాలు కంపుకొడుతున్నాయని.. గగ్గోలు పెడుతుంటే ఏమి విన్నారని ఏళ్ళ సమస్యలు ఇప్పటి వరకు సరి చేలెకపోవడం మాటతప్పడం కాదా..? చిన్న సమస్య డ్రైనేజీ తియ్యడానికి వీలు కాకపోతే ట్యాంకర్ ద్వారా బయటికి పంపించాలని అధికారులను నిలదీయకపో పోవడం మడం తిప్పడం కాదా..? మీకు చేతకాక పోతే పక్క మున్సిపాలిటీని సలహా తీసుకుని పని చేయండని ఘాటుగా విమర్శలు గుప్పారు. గత శాసనసభ్య ఎస్ వి.యస్.న్ వర్మ కోట్లునిధులుతెచ్చాను పట్టణ డెవలప్మెంట్ అని గొప్ప ప్రసంగాలు చేసారు, కానీ మార్పు అభివృద్ధి ఏది అని ఆమె అన్నారు.

అధికారులు ఆఫీస్ కే పరిమితం కాకుండా వార్డులో పర్యాటించి తక్షణమే మురికి నీరు బయటి పంపించే ఏర్పాట్లు చేయాలని వర్షాల కాలంలో సిజనల్ వ్యాధులు వస్తాయని తెలిసికూడా అధికారు ఇలా నిర్లక్ష్యం చేయడాన్ని తప్పుపట్టారు. కరోనా లాంటి వైరస్ లు మలేరియా, డెంగీ ఊరికినే రావని, ఇలాంటి తప్పిదాలు వలనే వస్తాయని అన్నారు. అన్న వస్తున్నాడు….అన్న వస్తున్నాడు అన్నారు. ఆయన ఎక్కడ? ప్రజలకి చేసిందేమీ లేదు. గుడ్ మార్నింగ్ సీఎం సార్! గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే సార్ !!.. మీకు ఇక గుడ్ నైటూ, గుడ్ బై చెప్పే రోజులు తొందరలోనే వున్నాయని, తక్షణమే ఈప్రాంతాన్ని మురికి నీరుని బయటికి పంపించి శుభ్రపరచకపోతే వార్డు ప్రజలను కలుపుకొని మున్సిపల్ ఆపీసు ఎదురుగా బయటాయిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో.. పుణ్యమంతుల సూర్యనారాయణ మూర్తి, పబ్బిరెడ్డి దుర్గాప్రసాద్, కసిరెడ్డి నాగేశ్వరరావు, తోట సతీష్, నామ శ్రీకాంత్, నామ సాయి గోపు సురేష్, యండ్రపు శ్రీనివాస్, గొల్లపల్లి గంగ, కందా సోమరాజు, వినుకొండ అమ్మాజీ, వినుకొండ శిరీష, వార్డు ప్రజలు జనసైనికులు నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.