పి.దొంతమూరు గ్రామంలో వాసంశెట్టి అప్పన్న కి మనోధైర్యాన్నిచ్చిన మాకినీడి

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం పి.దొంతమూరు గ్రామంలో వాసంశెట్టి అప్పన్న అనే వ్యక్తి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని జనసైనికులు చెప్పడంతో వారి నివాసానికి పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి జనసైనికులతో వెళ్లి మనోధైర్యాన్నివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పి.దొంతమూరు జనసేన నాయకులు, వాసంశెట్టి అప్పన్న ని వారి ఆరోగ్యం గురించి వివరాలు తెలుసుకుని వైద్య పరంగా డాక్టర్ తో మాట్లాడి చేస్తానని చెప్పడం జరిగింది. అలాగే వారికి ఫ్రూట్స్ ధన సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కర్రి హరిబాబు, పులి రమణ, గోపు సురేష్, జనసేన పార్టీ వెల్దుర్తి వైస్ ప్రెసిడెంట్ ఏనుగంటి హరిబాబు, యండ్రపు శ్రీనివాస్, సి.హెచ్ ధన, సి.హెచ్ స్వామి, సి.హెచ్ మధు, కె ప్రశాంత్, పి చంద్ర, సి సమేల్, కె సత్య, అశోక్, బి.దొర, జి.రాజు, జి ఏడుకొండలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.