జోగి రమేష్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మలిశెట్టి వెంకటరమణ

రాజంపేట జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాక్యలు చేసిన జోగి రమేష్ కు గానె, వైసీపీ నాయకులకు గానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత లేదని రాజంపేట జనసేన పార్టీ తరఫున మలిశెట్టి హెచ్చరించారు. ఈ జోగి రమేష్ ను ఒక్కటే హెచ్చరిస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారిని పిచ్చికుక్క అనే ముందు, పెళ్ళాల గురించి మాట్లాడే ముందు నీవు నీ మంత్రి పదవి తీసుకొని ఎంత మటుకు నీవు మీ నియోజకవర్గంలోని పెడనలో ఏం అభివృద్ధి చేశావో తెలుసుకొని మాట్లాడాలని హెచ్చరించారు. మీకు మంత్రి పదవులు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి తప్ప, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాల గురించి మాట్లాడే దానికి తప్ప మీరు మీ నాయకులు ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నాం అనే దానిపైన దృష్టి పెట్టి మాట్లాడాలని జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తున్నామని వెంకటరమణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు నంద్యాల హరి, వీరయ్య ఆచారి, గోపి, హేమంత్ తద్తరులు పాల్గొన్నారు.