జిల్లా అధ్యక్షుడు గాదెకి ఘనస్వాగతం పలికిన మల్లవోలు జనసైనికులు

పల్నాడు ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన మల్లవోలు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి తిరుణాళ్ళు సందర్భంగా విచ్చేసిన జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వంశీ , శిఖా బాలు లకి మల్లవోలు జనసైనికులు ఘన స్వాగతం పలికారు. గ్రామ ముఖద్వారం నుండి స్వామివారి గుడి వరకు భారీ ర్యాలిగా తరలివెళ్లారు. ఆలయ ప్రధాన అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి..స్వామి వారి దర్శనం చేశారు. అనంతరం స్వామి వారి అన్న ప్రసాద వితరణను జిల్లా అధ్యక్షుడు ప్రారంభించారు.

అధ్యక్షులు గాదె మాట్లాడుతూ… మల్లవోలు గ్రామం అంటే జనసేన అడ్డా అని దానిని మరింత బలపడేలా పనిచేయాలని అన్నారు. అలాగే త్వరలో క్రియశిలక సభ్యత్వాలు నమోదు కార్యక్రమాన్ని మొదలుపెడతామని… జన సైనికులు అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. పల్నాడులో జనసేన పార్టీ కోసం ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నాడని…మరింత విస్తృతంగా పని చేసి నియోజకవర్గంలో జనసేన జెండాని ఎగరేయ్యాలని జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వంశీ, షరీఫ్, కాశిం, శిఖా బాలు, మాచవరం మండల అధ్యక్షుడు బొమ్మా శ్రీను, పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, దాచేపల్లి మండల అధ్యక్షుడు మందపాటి దుర్గారావు, మల్లవోలు జనసైనికులు నార్ల అశోక్, రమేష్, బేతంచర్ల అప్పారావు, గంగా, జక్క మహేష్, యుగంధర్, గురజాల నరసింహారావు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.