యాతపేట గ్రామంలో “మన ఊరు – మన సేన”

ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, వి ఎన్ పురం దగ్గర యాతపేట గ్రామంలో “మన ఊరు – మన సేన” కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ నాయకులు శ్రీమతి కాంతిశ్రీ గ్రామ పర్యటన చేసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ సిద్ధాంతాలు వివరిస్తూ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. అలాగే అనంతరం గ్రామంలో 30 కుటుంబాలు కాంతిశ్రీ అధ్యక్షతన పార్టీ కండువా పుచ్చు కోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ జనసేన నాయకులు నాగారాజు, సతీష్, రాంబాబు, అలాగే రణస్థలం మండల నాయకులు లక్ష్మినాయుడు, శంకర్, సంతోష్, కోట రాముడు, లావేరు మండల నాయకులు కాకర్ల బాబాజీ, సత్య, నాని అలాగే జనసైనికులు పాల్గొన్నారు.