మర్రాపు ఆధ్వర్యంలో మండల కమిటీ సమావేశం
గజపతినగరం నియోజకవర్గం: జనసేన నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో మంగళవారం దత్తిరాజేరు మండల నాయకులు సమావేశం మంగళవారం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. సమావేశంలో భాగంగా త్వరలో జరగబోయే పల్లె పల్లెకు జనసేన కార్యక్రమం కార్యచరణ మరియు మరికొన్ని ముఖ్యమైన అంశాలపై చర్చించడం జరిగింది. మండలంలో కోఆర్డినేషన్ సభ్యులతో గ్రామాల వారీగా సమీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దత్తిరాజేరు సీనియర్ నాయకులు అనిల్ బెజవాడ, లక్ష్మణ, చరణ్, సూర్య, మురళి, ఆది నారాయణ మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/08/WhatsApp-Image-2023-08-01-at-4.39.49-PM-1024x578.jpeg)