‘నా సేన కోసం.. నా వంతు’ కార్యక్రమంపై మండలస్థాయి సమావేశం

  • ప్రజలలోకి బలంగా తీసుకెళ్ళాలని బండరు పిలుపు

కొత్తపేట, జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చినటువంటి ‘నా సేన కోసం.. నా వంతు’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ప్రజల వద్దకు విస్తృతంగా తీసుకువెళ్ళడానికి సంబంధించి కొత్తపేట మండల స్థాయి సమావేశం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్లు. మండల స్థాయి నాయకులు జనసేన కార్యకర్తలు. జనసైనికులు, పాల్గొన్నారు.