సంగిశెట్టికి శుభాకాంక్షలు తెలియజేసిన 21వ వార్డు ఇంచార్జ్ మండపాక దుర్గాప్రసాద్

కాకినాడ, జనసేన పార్టీ కాకినాడ నగర అధ్యక్షులుగా నియమితులైన సంగిశెట్టి అశోక్ ని జనసైనికులు అందరితో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని కాకినాడ జనసేన పార్టీ 21 వ వార్డు ఇంచార్జ్ మండపాక దుర్గాప్రసాద్ తెలియజేసారు. ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం కాకినాడ నగర అధ్యక్షులుగా సంగిశెట్టి అశోక్ నియమించడం చాలా ఆనందంగా ఉందని పార్టీ కోసం నిరంతరం కష్టపడే వ్యక్తి సంగిశెట్టి అని నిరంతరం జనసైనికులకు ఆయన ఎప్పుడూ అందుబాటులో ఉంటారని ఎవరికి ఏ ఆపదయిన వెంటనే ఆదుకునే వ్యక్తి సంగిశెట్టి అశోక్ పార్టీ అభివృద్ధికి పాటుపడే వ్యక్తి అని ఆయన వెంటే మేము వుంటూ సహాయసహకారాలు అందిస్తామని అన్నారు.