మంగళగిరి నియోజకవర్గం కోర్ కమిటీ సమావేశం

మంగళగిరి: జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం మంగళగిరి ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన మంగళగిరి నియోజకవర్గ కోర్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన అంశాలు.. ఎంటిఎంసీ పరిధిలో ఉన్న వార్డు కమిటీల ఏర్పాటు పై చర్చ. మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై చర్చ. మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం. 2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపుకు తదుపరి కార్యాచరణపై చర్చ. మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల మూడు మండలంలో ఉన్న గ్రామ కమిటీలు ఏర్పాటుపై చర్చించడం జరిగినది. ఈ సమావేశంలో కోర్ కమిటీ సభ్యులు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, ఐ.టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి చవ్వాకుల కోటేష్ బాబు, చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, గుంటూరు జిల్లా కార్యదర్శి రావిరమా, గుంటూరు జిల్లా సంయుక్త కార్యదర్శి బడే కోమలి, మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శివ నాగేంద్రం, మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు, సీనియర్ నాయకులు తిరుమలశెట్టి కొండలరావు తదితరులు పాల్గొన్నారు.