ఓల్డ్ మలక్‌పేటలో గుర్తులు తారుమారు

ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో సీపీఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. డివిజన్ పరిధిలో అభ్యర్థుల పార్టీ గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్‌ పత్రంలో సీపీఐ పార్టీ అభ్యర్థి పేరు ఎదురుగా సీపీఐ(ఎం) పార్టీ గుర్తు ముద్రించారు. బ్యాలెట్‌ పత్రంలో అభ్యర్థుల గుర్తులు మారిన కారణంగా పోలింగ్ నిలిపివేయాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఎన్నికల అథారిటీ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకునే అవకాశముంది.