డిజిటల్ క్యాంపెయిన్ లో మంత్రాలయం జనసేన

మంత్రాలయం నియోజకవర్గం జనసెన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గుడ్ మార్నింగ్ సీఎం డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమంలో పొంత నరసింహులు ఆధ్వర్యంలో కోసిగి మండలం లోని కోసిగి నుండి చింతకుంట, పల్లెపాడు మీదుగా ఎమ్మిగనూరు వెళ్లే రహదారి గత కొన్ని సంవత్సరాలుగా అద్వాన పరిస్థితుల్లో ఉంది. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడేళ్లయిన స్థానిక ఎమ్మెల్యే అయినా, నాయకులైన ఇంతవరకు పట్టించుకున్న దాఖలాలు లేవు.అలాగే కోసిగి నుండి డి.బెలగల్ మీదుగా ఎమ్మిగనూరు వెళ్లే రోడ్డు కూడా అద్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవే కాకుండా కౌతాళ మండలం, పెద్దకడబూరు మండలం, మంత్రాలయ మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారులు అన్నీ కూడా అద్వాన పరిస్థితుల్లో ఉన్నాయని మంత్రాలయం జనసేన తాలూకా నాయకులు పొంత నరసింహులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, రజాబ్, హనుమంతు, దొడ్డి వెంకటేష్, దేవయ్య, శశి, వీరాంజని, వీరారెడ్డి జనసైనికులు పాల్గొన్నారు.